Wednesday, June 1, 2011

గొప్ప వారికుండు గొంచె బుద్ధి !!

(మాజీ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నారాయణ దత్ తివారి ఉదంతము దృష్టిలో బెట్టికొని)

రాజ్య పాల కుండు రాసలీలల దేలి
రాజ భవను విడిచె రచ్చగాగ
తప్పు డైన పనులు ముప్పు దెచ్చెను గదా
గొప్ప వారికుండు గొంచె బుద్ధి !!

ధర్మసూను డతను ధర్మమ్మునేవీడి
ద్రోణుని హత మార్చ దోషియయ్యె
నంత రాత్మ జంపి వింతగా మాట్లాడె
గొప్ప వారికుండు గొంచె బుద్ధి!!!.  

(శంకరాభరణం  బ్లాగు లో20-05-2011 నాటి  సమస్యా పూరణ-343లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

No comments:

Post a Comment