Monday, November 1, 2010

పండు ముసలి దెచ్చి కొండపై వదిలిరి,

   పండు ముసలి దెచ్చి కొండపై వదిలిరి,
   కన్న తల్లి పట్ల కఠిను లైరి  ,
   తనయు లైన వారి  తలపండు  పగలదా !
   మంద వారి మాట మణుల మూట!

(పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా వాసులు తమ కన్నతల్లిని
మభ్యపెట్టి తెచ్చి తిరుమల కొండపై వదిలి వెళ్ళిన ఉదంతం నిన్న
TV9 లో చూడ  కళ్ళలో నీళ్లుతిరిగాయి .తనను వదిలించు కోవడానికి
తన తనయులు పన్నిన పన్నాగానికి బలై ,చిగుటాకులా వణుకుతూ
ఆ మాతృమూర్తి పడుతున్న  ఆవేదన ,ఆమె హృదయ వేదన నిజంగా
కదిలించి వేసింది. ఆమె ఎప్పటినా తన వారలను చేరుకోవాలని కోరుకుంటున్నాను)  

  

No comments:

Post a Comment