Wednesday, November 24, 2010

ధర్మ రాజు గలిగె తమ్ముల నలుగుర!

ధర్మ రాజు గలిగె తమ్ముల నలుగుర
గాలి కొడుకునకును గలరు మువురు
నరుని కిరువురు మరి నకులుని కొక్కరే
పంచ పాండ వులన పదుగురు కద !

(నలుగురు +మువ్వురు  +ఇరువురు +ఒక్కరు = పదుగురు.)
  4+3 +2 +1 =10 .

ప్రతిభ ఎంత గలదొ పౌరాణికము లందు
పదిలొ కెళ్ళి డీవొ ప్రశ్న లడుగ
చెప్పు వారి గనక చెప్పెను పంతులే
పంచ పాండ వులన పదుగురు కదా ! 
( పది లొ =పదవ తరగతి ,డీవొ = D E O  సరదాగా వ్రాసినది ఎవరినీ నొప్పించాలని కాదు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు క్షమాపణలతో}

No comments:

Post a Comment