Tuesday, April 5, 2011

నాకు మోదమ్ము గూర్చు సునామి యిపుడు

నాకు మోదమ్ము గూర్చు సునామి యిపుడు
వచ్చి ముంచగా నవినీతి వారసులను
నిర్ణయమ్ముల జేయని నిర్దయులను
ప్రజల నిత్యము వంచించు పాలకులను
నోరు దెరవని నాయక భీరువులను
మాట దప్పిన మతిహీన మంత్రి వరుల
కొంగు చాటున జేరిన కుటిల మతుల
రైతు భూముల బలిగొన్న రాక్షసులను!!!!!
(శంకరాభరణం  బ్లాగు లో12-03 -2011 నాటి  సమస్యా పూరణ-253లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

No comments:

Post a Comment