Thursday, March 24, 2011

పతికి నమాస్కరింపగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్!

సతతము సత్య మార్గమున సాగ లభించు నదేమి ? నేటి భా
రతమున,యేలు రాజు ధృతరాస్ట్రుని బోల, యమాత్య శేఖరుల్
పతితులు గాగ , సూనుల కుపాది ని గోరగ తండ్రి ,పార్వతీ
పతికి నమాస్కరింపగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్!

 (శంకరాభరణం  బ్లాగు లో10-02 -2011 నాటి వారాంతపు  సమస్యా పూరణలోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
  

No comments:

Post a Comment